పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధిస్తూ ఆలయ ఈవో ఎ.భాస్కరరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ప్లాస్టికేతర వస్తువులు మాత్రమే వాడాలని పేర్కొన్నారు. ఈ నిషేధాన్ని సిబ్బంది విధిగా పాటించాలని ఆదేశించారు.