కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఒవైసీకి చెందిన నిర్మాణాలు కూల్చాలని అన్నారు. ‘చాదర్ఘాట్, మలక్పేట్, మూసారాంబాగ్, జియాగూడలో హిందువుల ఇళ్లే కూలుస్తున్నారు. ముస్లింల ఇళ్ల జోలికి వెళ్లడం లేదు. హైడ్రా తీరుతో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.