రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కారును పోలీసులు తనిఖీ చేశారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ముస్తాబాద్(M) వెంకట్రావుపల్లి గ్రామ శివారులోకి రాగానే అక్కడ ఉన్న చెక్ పోస్ట్ వద్ద బండి కాన్వాయ్ని పోలీసులు ఆపారు. అనంతరం కార్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం బండి సంజయ్ ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు.