ఐపీఎల్లో సమయం వృథా కాకుండా చెక్ పెట్టేందుకు ఈ సారి బీసీసీఐ కొత్త టెక్నాలజీని తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్-2024లో ‘స్మార్ట్ రీప్లే సిస్టమ్’ను ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా అంపైర్ల తప్పిదాలకు చెక్ పెట్టడమే కాకుండా వేగంగా, కచ్చితత్వంతో నిర్ణయాలు తీసుకోవడానికి వీలు ఉంటుంది. అయితే దీనిపై బీసీసీఐ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.