టీమిండియా కోసం బీసీసీఐ స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసింది. తుపాన్ వల్ల భారత జట్టు బార్బడోస్లో చిక్కుకుంది. ఇక్కడ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ముందు జాగ్రత్తతో అక్కడి అధికార యంత్రాంగం బార్బడోస్ విమానాశ్రయాన్ని మూసివేసింది. దీంతో ఆటగాళ్లందరూ హోటల్ గదుల్లోనే ఉండిపోయారు. అయితే బార్బడోస్లో వాతావరణ పరిస్థితులు కాస్త మెరుగుపడడంతో ఇవాళ సాయంత్రం బార్బడోస్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో టీమిండియా భారత్కు చేరుకోనుంది.