వర్షా కాలంలో ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందులోనూ బస్సులు, ట్రైన్లలో ప్రయాణం చేసేటప్పుడు లోపల వర్షం కురిస్తే చికాకుగా అనిపిస్తుంది. ఇదే కోవలో ట్రైన్లో ప్రయాణికులకు ఇలాంటి అనుభవం ఎదురైంది. రైలులో పైకప్పు నుంచి లీక్ అయి వర్షపు నీరు కిందకు పడింది. దీంతో ప్రయాణికులు రైలులో గొడులు పట్టుకుని ప్రయాణించారు. ఇది 2023లో జరగగా, కేరళ కాంగ్రెస్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మరోసారి వైరల్ అవుతోంది.