ప్రధాని మోదీకి బీసీసీఐ స్పెష‌ల్ గిఫ్ట్‌!

74చూసినవారు
ప్రధాని మోదీకి బీసీసీఐ స్పెష‌ల్ గిఫ్ట్‌!
2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ గెలిచిన రోహిత్ సేన ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన విషయం తెలిసిందే. ఢిల్లీ విమానాశ్ర‌యంలో దిగిన టీమిండియా ప్లేయ‌ర్లు.. ప్రధాని నివాసంలో మోదీని క‌లిశారు. ఈ సందర్భంగా మోదీకి బీసీసీఐ స్పెష‌ల్ గిఫ్ట్ అంద‌జేసింది. ‘నమో’ నం. 01 పేరిట ఉన్న‌ ప్రత్యేక టీమిండియా జెర్సీని ఆయ‌న‌కు అందజేసింది. జ‌ట్టు స‌భ్యుల‌ సమక్షంలో బీసీసీఐ సెక్రటరీ జైషా, అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ ఈ స్పెష‌ల్‌ జెర్సీని మోదీకి అంద‌జేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్