ప్రధాని మోదీకి బీసీసీఐ స్పెషల్ గిఫ్ట్!
By Gaddala VenkateswaraRao 74చూసినవారు2024 టీ20 వరల్డ్కప్ గెలిచిన రోహిత్ సేన ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన విషయం తెలిసిందే. ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన టీమిండియా ప్లేయర్లు.. ప్రధాని నివాసంలో మోదీని కలిశారు. ఈ సందర్భంగా మోదీకి బీసీసీఐ స్పెషల్ గిఫ్ట్ అందజేసింది. ‘నమో’ నం. 01 పేరిట ఉన్న ప్రత్యేక టీమిండియా జెర్సీని ఆయనకు అందజేసింది. జట్టు సభ్యుల సమక్షంలో బీసీసీఐ సెక్రటరీ జైషా, అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఈ స్పెషల్ జెర్సీని మోదీకి అందజేశారు.