స్టాక్ మార్కెట్లు కొత్త గరిష్టాలను తాకిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సెబీ, సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్)లకు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. మార్కెట్ విస్తరిస్తున్న సమయంలో వెన్నెముక వ్యవస్థ స్థిరత్వం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరిన్ని ట్రిబ్యునల్ బెంచ్లు ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ముంబైలోని SAT కార్యాలయ ప్రారంభోత్సవంలో ఈ వ్యాఖ్యలు చేశారు.