సీఎం జగన్పై రాయితో దాడి జరిగిన ఘటనపై ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. "మీరు సురక్షితంగా ఉన్నందుకు సంతోషం. జాగ్రత్త జగన్ అన్నా. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై కఠినమైన చర్యలు చేపట్టాలని నేను కోరుతున్నాను." అని ఆయన పేర్కొన్నారు.