బెంగళూరులో మెట్రో ఛార్జీలను బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్ తగ్గించింది. టికెట్ ధరలను 30 శాతం తగ్గించేందుకు అంగీకరించింది. ఇటీవల ధరలను దాదాపు 50 శాతం వరకు పెంచడంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ధీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీఎమ్ఆర్సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ మహేశ్వర్ రావు వెల్లడించారు.