ఐక్యరాజ్యసమితికి మొఘల్ చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడు యాకూబ్ హబీబుద్దిన్ లేఖ రాశారు. మహారాష్ట్రలోని ఔరంగజేబు సమాధిని తొలగించాలని ఓ వర్గం వారు హింసాత్మక ఘటనలకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శంభాజీ నగర్ జిల్లాలో ఉన్న ఔరంగజేబు సమాధికి భద్రత కల్పించాలని అలాగే అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని లేఖలో పేర్కొన్నారు.