ధాన్యం డబ్బులతో బెట్టింగ్‌.. చివరకు సూసైడ్

73చూసినవారు
ధాన్యం డబ్బులతో బెట్టింగ్‌.. చివరకు సూసైడ్
ఆన్‌లైన్ బెట్టింగ్ లో నష్టపోయి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం.. ధాన్యం అమ్మిన డబ్బు రూ.లక్షన్నరను భాను ప్రకాష్(24) అనే యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పెట్టి నష్టపోయాడు. దీంతో మనస్థాపానికి గురై ఈ నెల 13న పురుగుల మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్