యూపీఎస్సీ ఆదివారం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పేపర్ సులభంగా వచ్చిందని అభ్యర్థులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జనరల్ స్టడీస్, సీశాట్ పేపర్లు రెండింటిలో తికమక పెట్టకుండా ప్రశ్నలు సూటిగానే ఇచ్చారని నిపుణులు అంటున్నారు. పేపర్ ఈజీగా ఉండటంతో ఈసారి కటాఫ్ పెరగొచ్చని(80-95) ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. గతేడాది రెండు పేపర్లు టఫ్గా ఉండటంతో కటాఫ్ 75గా నిర్ణయించారు.