లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌

79చూసినవారు
లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌
లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా సీనియర్‌ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ ఎంపికయ్యారు. స్పీకర్‌ ఎన్నిక పూర్తయ్యే వరకు లోక్‌సభ ప్రిసైడింగ్‌ అధికారిగా ఆయన కార్యకలాపాలు నిర్వహిస్తారు. 18వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయిస్తారు. ఆయనకు సహాయంగా ఉండే ఛైర్‌పర్సన్ల ప్యానెల్‌ లో కె.సురేష్‌ (కాంగ్రెస్‌), టీఆర్‌ బాలు, రాధామోహన్‌ సింగ్‌ (బీజేపీ), ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే (బీజేపీ), సుదీప్‌ బంధోపాధ్యాయ (టీఎంసీ) ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్