భారతీయ బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకుని విదేశాలకు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యా తన ప్రేయసి జాస్మిన్ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. అమెరికాకు చెందిన జాస్మిన్ ఒకప్పుడు మోడలింగ్ చేసి, ప్రస్తుతం సాహస యాత్రకురాలిగా కొనసాగుతున్నారు. పౌర హక్కులు, మానవతా చట్టాల గురించి పోరాడే 'సీజ్ఫైర్ సెంటర్ ఫర్ సివిలియన్ రైట్స్'ను ఆమె సపోర్ట్ చేస్తోంది.