లోక్సభ ఎన్నికల ముందు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఎదురైంది. బినా కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్మలా సప్రే ఆదివారం సీఎం మోహన్ యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరారు. మధ్యప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం కాంగ్రెస్ నేతలు వరుసగా బీజేపీలో చేరుతుండటంతో రాష్ట్రంలో ఆ పార్టీ గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటోంది. తాజాగా ఎమ్మెల్యే సైతం కాంగ్రెస్ను వీడడం మరింత కలవరపెడుతోంది.