ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీకి వనౌటు దేశం షాక్ ఇచ్చింది. లలిత్ మోదీ ఐపీఎల్ ఛైర్మన్గా ఉన్నప్పుడు అవకతవకలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తాజాగా వనౌటు దేశ పౌరసత్వం తీసుకున్నారు. అయితే భారత హైకమిషనర్ నీతా భూషణ్ సూచన మేరకు వనౌటు ప్రధాని లలిత్ మోదీ పారసత్వాన్ని రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.