తెలంగాణాలో కలకలం రేపిన చిన్నారుల అక్రమ రవాణా రాకెట్ కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. చిన్నారుల్ని అక్రమ రవాణా చేసే ఏజెంట్లలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు గుర్తించారు. విక్రయాల విషయంలో ఎవరికీ అనుమానం రాకుండా నిందితులు కోడ్భాష ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. బైక్ అంటే మగ, స్కూటీ అంటే ఆడపిల్ల అని పలుకుతారు. ఐదేళ్ల నుంచి చిన్నారుల్ని అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది.