బీజేడీ సస్పెండ్‌ చేసింది.. బీజేపీ కండువా కప్పింది..! (Video)

69చూసినవారు
బిజూ జనతాదళ్‌ పార్టీలో బహిష్కరణకు గురైన ఎంపీ సుజీత్‌ కుమార్‌ బీజేపీలో చేరారు. బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వ పనితీరు నచ్చడంతో తాను ఈ పార్టీలో చేరానని చెప్పారు. ఒడిశా సీఎం మోహన్‌ చరణ్‌ మాఝీ పరిపాలన నచ్చిందని అన్నారు. బీజేపీలో చేరడాన్ని తాను తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్