ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు దిశగా పయనిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో మెజారిటీ మార్క్ను దాటిందని ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోయేందుకు సిద్ధంగా ఉన్న పార్టీలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను(ఈవీఎం) నిందించేందుకు ముందుగానే పథకం వేశాయని ఆరోపించారు. ‘‘దీనిలో ఎలాంటి మార్పు ఉండదు. వారి పథకాన్ని అమలుచేయాలని ఇప్పటికే నిర్ణయించుకుని ఉంటారు’’ అని జోస్యం చెప్పారు.