తెలంగాణలో ఈనెల 29న
బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీల సమావేశం జరుగనుంది. కరీంనగర్, జహీరాబాద్, మెదక్, చేవెళ్ల ఎంపీ స్థానాలపై నేతలు చర్చించనున్నారు. అలాగే నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలపై కూడా చర్చించనున్నారు. ఈ సమావేశానికి
బీజేపీ జాతీయ నేతలు తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ హాజరు కానున్నారు.