పేదలను ఆదుకునే ప్రభుత్వం BJP మాత్రమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అభివృద్ధి పేరుతో BRS ప్రభుత్వం పేద ప్రజలను నిర్లక్ష్యం చేసిందని.. మాయమాటలతో BRS ప్రజలను తప్పుదోవ పట్టించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా మాయమాటలు చెప్పకుండా ప్రజలకు సేవ చేయాలన్నారు. BRS ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బస్తీలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు.