CM రేవంత్ టెండర్లు.. MLA మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

59చూసినవారు
బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చీకటి టెండర్లు చేసి రేవంత్ బావమరిది సూదిని సృజన్‌ రెడ్డికి రూ. 400 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనులు ఇచ్చారని.. మెగా కృష్ణారెడ్డికి రూ.1100 కోట్ల రూపాయల పనులు అప్పగించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి వచ్చిన రూ. 3 వేల కోట్ల నిధులను చీకటి టెండర్లు కోట్ చేసి కుంభకోణం చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి తమ్ముడు, బావమరిది కూడా కాంట్రాక్టులో ఇన్వాల్వ్ అయ్యారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై ఒక వైపు జ్యుడిషియల్ విచారణ జరుగుతుంటే.. అదే మెగా కృష్ణారెడ్డికి రూ. 11 వందల కోట్ల రూపాయల పనులు ఎలా అప్పగించారు?

సంబంధిత పోస్ట్