EVM వివాదంపై శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందించారు. ‘
బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈవీఎంపై ఓ పుస్తకాన్ని ప్రచురించింది. ఎల్కే అద్వానీ సైతం దానిని ఆమోదించారు. అన్ని సందేహాలను తొలగించడం ఈసీ బాధ్యత. ఒక్క ఓటరుకి అనుమానం ఉన్నా దానిని తొలగించాలి. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, న్యాయంగా జరగాలి. దేశ రాజ్యాంగపద్ధతులపై ప్రభావం పడకూడదు. అందుకే దీనిగురించి మాట్లాడుతూనే ఉంటాం’ అని చెప్పుకొచ్చింది.