రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పటికీ మార్చదు: రాజ్‌నాథ్‌సింగ్

60చూసినవారు
రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పటికీ మార్చదు: రాజ్‌నాథ్‌సింగ్
భారత రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పటికీ మార్చదని.. రిజర్వేషన్లు తొలగించదని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. బీజేపీ రిజర్వేషన్లు తొలగించడానికి ప్రయత్నిస్తుందని ఇటీవల కాంగ్రెస్, ఇతర పార్టీలు ఆరోపించాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ 1976లో భారత రాజ్యాంగ పీఠికలో మార్పులు చేశారని.. ఇప్పుడు అనవసరంగా బీజేపీని లక్ష్యంగా చేసుకొని ఎన్నికల్లో లబ్ది పొందేందుకు అబద్దాలు చెబుతున్నారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్