పడవ బోల్తా.. ఆరుగురు గల్లంతు (వీడియో)

84చూసినవారు
బీహార్‌లోని పాట్నాలో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. గంగా దసరా పండుగ సందర్భంగా భారీగా భక్తులు తరలి వచ్చారు. గంగా నదిలో ఉమానాథ్ ఘాట్‌ వద్ద కొందరు స్నానం పూర్తి చేశారు. అనంతరం పడవలో నది దాటుతుండగా అది మునిగిపోయింది. 17 మందిలో 11 మంది ఈత కొట్టి, ప్రమాదం నుంచి బయటపడ్డారు. మరో ఆరుగురు గల్లంతయ్యారు. వారి కోసం NDRF, SDRF బృందాలు గాలిస్తున్నాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్