అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

57చూసినవారు
అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
దేశ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్‌, బీహార్, ఇలా పలు రాష్ట్రాలకు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా సోమవారం అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది ఆవరణలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించి అనుమానాస్పదంగా ఏ వస్తువు కనిపించలేదని తేల్చారు.

సంబంధిత పోస్ట్