ఢిల్లీలోని నార్త్ బ్లాక్లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు ఈ-మెయిల్లో వచ్చినట్లు ఢిల్లీ పోలీసులు బుధవారం తెలిపారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి అగ్నిమాపక యంత్రాలతో పాటు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ రంగంలోకి దిగారు. ఈ- మెయిల్ ద్వారా పోలీస్ కంట్రోల్ రూమ్ కి బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నార్త్ బ్లాక్లోని హై అలర్ట్ కొనసాగుతోంది.