కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లు పాకిస్థాన్ సానుభూతిపరులని
మోదీ ఆరోపించారు. అణువిద్యుత్ పేరుతో దేశాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. బుధవారం యూపీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో
మోదీ ప్రసంగించారు. ఒకప్పుడు ఉగ్రవాదాన్ని పెంచి పోషించి, భారత్పై కన్నేసిన పాకిస్థాన్ ఇప్పుడు పతనావస్థకు చేరుకుందని, అయితే ఆ దేశ సానుభూతిపరులైన ఎస్పీ,
కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని అన్నారు.