ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలోని జానకి రాముడి ఆలయాన్ని బాంబులతో పేల్చేస్తామని బెదిరింపు పోస్టర్లు వెలిశాయి. అయోధ్యలోని రామమందిరం ప్రాణప్రతిష్ట జరిగిన ఆరు రోజుల తర్వాత జానకి రాముడి ఆలయాన్ని పేల్చేస్తున్నట్లు పోస్టర్లు వెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అంతేకాకుండా
బీజేపీ నేత రోహిత్ సాహును కూడా చంపేస్తానని బెదిరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.