లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్కు వరుస షాక్లు తగులుతున్నాయి. హరియాణాలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. దిగ్గజ బాక్సర్, ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ కాంగ్రెస్ ను వీడారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆ పార్టీలో చేరారు. ఆయన మధుర నుంచి కాంగ్రెస్ తరుపున ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. అక్కడి నుంచి బీజేపీ తరుపున ఎంపీగా హేమమాలిని ఉన్నారు. అయితే అనూహ్యంగా విజేందర్ బీజేపీలో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు.