పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. డార్జిలింగ్ జిల్లాలోని న్యూజల్పాయ్గుడిలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. గూడ్స్ ను కాంచనగంగ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. దీంతో కాంచన్జంగా ఎక్స్ప్రెస్ కు చెందిన రెండు కంపార్ట్మెంట్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాద ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.