ఆఫ్రికా ఖండంలో ఒకటైన కాంగోలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాంగో నదికి ఉపనది అయిన క్వా.. నదిలో ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడటంతో 21 మంది చిన్నారులతో సహా 86 మంది మరణించారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ 185 మందిని సురక్షితంగా రక్షించింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బోటులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనేది ఇంకా తెలియరాలేదు.