దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ(IMD) చల్లని కబురు చెప్పింది. దేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు ఇవాళ ఉదయం కేరళను తాకాయని వెల్లడించింది. రాబోయే మూడు లేదా నాలుగు రోజుల్లో రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. ఇంకో నెల రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తామని పేర్కొంది. కాగా, ఈ సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని గత నెలలో ఐఎండీ అంచనా వేసింది.