లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా తెలంగాణలో నలుగురు అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కరీంనగర్ నుంచి వినోద్కుమార్, పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్, ఖమ్మం - నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత పేర్లను ఖరారు చేశారు. తెలంగాణ భవన్లో రెండు రోజులుగా ముఖ్యనేతలతో చర్చించిన కేసీఆర్ వీరిని ఏకగీవ్రంగా ఎంపిక చేశారు.