యూపీలోని కాస్గంజ్లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ మహిళపై ఎనిమిది యువకులు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ వివాహిత భర్తతో కలిసి సరదాగా గడుపుదామని నడ్రాయ్ అక్విటెక్ట్ అనే పిక్నిక్ స్పాట్కు వెళ్లారు. ఈ క్రమంలో ఎనిమిది మంది యువకులు భర్తను కొట్టి ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. ఆపై వీడియో కూడా తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులలో 5గురిని అరెస్ట్ చేయగా మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.