AP: నిన్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన నిర్మల ఇంటర్ బైపీసీలో 966 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచారు. 2021-22లో టెన్త్లో 537 మార్కులు సాధించారు. కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా ఏడాది పాటు చదువుకు దూరమయ్యారు. అప్పటి కలెక్టర్ సృజన ప్రోత్సాహంతో నిర్మల ఆస్పరి కేజీబీవీలో చేరారు. ఫస్టియర్లో 420, సెకండియర్లో 966 మార్కులు సాధించారు. ఐపీఎస్ కావడమే తన లక్ష్యమని నిర్మల చెప్పారు.