బస్సులో సీటు కోసం దారుణంగా తన్నుకున్నారు.. వీడియో

81చూసినవారు
TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో సీటు కోసం గోడవపడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిద్దిపేట- సిరిసిల్ల రహదారిలో సిద్దిపేట డిపోకు చెందిన బస్సులో గురువారం ఈ ఘటన జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు, మరో వ్యక్తికి మధ్య సీటు విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సదరు మహిళలను ఆ వ్యక్తి దుర్భాష లాడటంతో గొడవ ముదిరి ఒకరినొకరు తన్నుకున్నారు. కండక్టర్ కల్పించుకొని గొడవ పడ్డ వ్యక్తిని బస్సులోంచి దింపి పంపించేశారు.

సంబంధిత పోస్ట్