పుల్వామాలో మళ్లీ పేలిన తూటా

58చూసినవారు
పుల్వామాలో మళ్లీ పేలిన తూటా
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. పుల్వామా జిల్లాలోని నిహామాలో ఉగ్రవాదులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందడంతో కార్డన్ సెర్చ్ ప్రారంభించారు. ఆ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ‘పుల్వామా జిల్లా నిహామా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. పోలీసులు, భద్రతా బలగాలు పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి’. అని కశ్మీర్ జోన్ పోలీసులు Xలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్