రాజ్కోట్ టెస్టులో ఇంగ్లండ్పై విజయం సాధించిన భారత్ ఐదు టెస్టుల సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అదరగొట్టిన భారత్.. అదే జోష్ లో రాంచీలో జరిగే 4వ టెస్టుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో టీంలో స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ టెస్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడు. అతడిపై ఒత్తిడిని తగ్గించేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.