పాకిస్థాన్లోని కరాచీ నగరం లియాఖతాబాద్ ప్రాంతంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సింధ్ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం కారణంగా ఏడుగురు గాయపడ్డారు. తొలుత ఎమర్జెన్సీ వార్డులో షార్ట్ సర్క్యూట్ జరిగింది. తర్వాత రిఫ్రిజిరేటర్ కంప్రెషర్ పగలడంతో మంటలు చెలరేగాయి. వార్డులో ఉన్న కొందరికి మంటలు అంటుకోవడంతో ప్రాణభయంతో వారు పరుగులు పెట్టారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.