వంతెనపై నుంచి పడిన బస్సు.. పలువురికి గాయాలు(వీడియో)

56చూసినవారు
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం వీఐపీ ఘాట్ సమీపంలో మొరాదాబాద్ డిపోకు చెందిన బస్సు వంతెనపై అదుపు తప్పి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. మొరాదాబాద్ రోడ్‌వేస్ బస్ డిపో నుంచి బయలుదేరిన బస్సు డెహ్రాడూన్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికులు అప్రమత్తమై బాధితులకు సాయం అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్