లోయలో పడ్డ బస్సు.. 23 మంది మృతి

62చూసినవారు
లోయలో పడ్డ బస్సు.. 23 మంది మృతి
పెరూలో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 23 మంది చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు తయాబాంబా నుంచి లిమా వెళ్తుండగా, కుస్కా జిల్లాలోని రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. అతివేగం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్