ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఎండలు మండిపోనున్నాయి. మంగళవారం 61 మండలాల్లో తీవ్ర వడగాలులు, 173 మండలాల్లో వడగాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నిన్న ఒక్కరోజే వడదెబ్బ వల్ల 11 మంది మృతి చెందారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.