కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పై అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అతను ప్రిన్సిపల్ గా ఉన్న సమయంలో అనాథ శవాలను కూడా అమ్మేశాడని, వాడేసిన సిరంజులను, ఇతర వైద్య సామాగ్రిని కూడా రీ సైక్లింగ్ చేసి సొమ్ము చేసుకునే వాడని, ఫెయిలయిన విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని పాస్ చేసే వాడని విచారణలో తేలింది. ప్రస్తుతం ముర్షిదాబాద్ డిప్యూటీ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్గా ఉన్న అక్తర్ అలీ సిట్ విచారణలో ఈ విషయాలను తెలిపారు.