దేశంలో రెండు లోక్‌సభ, 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు

57చూసినవారు
దేశంలో రెండు లోక్‌సభ, 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2 లోక్‌సభ, 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. కేరళ(వయనాడ్‌), మహారాష్ట్ర(నాందేడ్‌) లోక్‌సభ, వేర్వేరు రాష్ట్రాల్లో 48 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. వయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గంతో పాటు 47 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 13న, నాందేడ్‌ లోక్‌సభ సీటుతో పాటు ఉత్తరాఖండ్‌లోని ఒక అసెంబ్లీ స్థానానికి నవంబర్‌ 20న పోలింగ్ నిర్వహించి 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్