కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏను రద్దు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నేర చట్టాలను కూడా తొలగిస్తామని చెప్పారు. వీటి స్ధానంలో నూతన చట్టాలను తీసుకొస్తామని తెలిపారు. సీఏఏను తాము వ్యతిరేకిస్తామని ప్రియాంక గాంధీ కూడా తెలిపారని చిదంబరం వివరించారు.