తనను అసెంబ్లీకి వెళ్లనివ్వకుండా టీడీపీ, బీజేపీ అడ్డుపడుతోందని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. 2019లో వచ్చిన మెజార్జీ కన్నా ఒక్క ఓటు తగ్గినా.. తాను నైతికంగా ఓడినట్లే అని అన్నారు. తనకు టికెట్ రాదని కూటమి నేతలు గోబెల్స్ ప్రచారం చేశారని దుయ్యబట్టారు. సత్తెనపల్లిలో వైసీపీ జెండా ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు.