AP: మంత్రి లోకేశ్ను హైదరాబాద్లో ఉంటున్న APక్యాబ్ డ్రైవర్లు కలిశారు. తెలంగాణ ప్రభుత్వ నిబంధనలపై వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో తమ వాహనాలకు మళ్లీ లైఫ్ట్యాక్స్ చెల్లించాలని అక్కడి అధికారులు చెబుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈనెల 6న జరగనున్న ఇరురాష్ట్రాల CMలు చంద్రబాబు, రేవంత్రెడ్డి భేటీలో తమ సమస్యకు పరిష్కారం లభించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.