జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర హోదా.. కేబినెట్ తీర్మానానికి ఆమోదం తెలిపిన లెఫ్టినెంట్ గవర్నర్

72చూసినవారు
జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర హోదా.. కేబినెట్ తీర్మానానికి ఆమోదం తెలిపిన లెఫ్టినెంట్ గవర్నర్
జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ సీఎం ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ఆమోదించారు. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు క్యాబినెట్‌ సమావేశంలో ఓ అంగీకారానికి వచ్చారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సంబంధించిన విషయాలపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో సమావేశమయ్యేందుకు సీఎం త్వరలో ఢిల్లీ వెళ్లనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్